Sunday, October 31, 2010

శ్రీ వేంకటేశ్వర..!!

పై రచనను గమనిస్తే ఇది ఒక చిత్ర కవిత్వం గా బోధపడుతుంది.
మొత్తం పన్నెండు పాదాలు. ప్రతీ పాదం లోనూ ముప్పై ఆరు అక్షరాలు. పాదం మొదలూ చివరా ఒకే అక్షరం ఉంది.. మొత్తం పన్నెండు పాదాలూ కలిపి నిలువుగా మొదటి అక్షరాలను కలిపి చదివితే ' వేంకటేశ్వర' దర్శనమవుతుంది...! అలాగే చివరి అక్షరాలు కూడా...!! మధ్యలో స్వామి గురించిన ప్రశస్తి. ఆది మధ్యాంతరహితుడైన ఆ స్వామిని ఒక చిన్న కవిత లో ప్రత్యేకించి ఆది అంత్యాలలోదర్శించడం చిత్రం గా లేదూ..!!


ఇది మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు గారి చిత్రమైన రచన. వారు భిలాయినగర్ వాస్తవ్యులు. అక్కడి స్టీల్ ప్లాంట్ లో సీనియర్ అక్కౌంట్స్ మేనేజరు గా పనిచేసి రిటైర్ అయ్యారు. భిలాయి లోనే స్థిరపడ్డారు. వారు తెలుగు గడ్డకి దూరంగా వున్నా తన రచనా వ్యాసంగం కొనసాగించిన సాహితీ వేత్త. తెలుగు, హిందీ ఇంగ్లీషు భాషలలో వారివి ఎన్నో రచనలు సుమారు అన్ని తెలుగు దిన, వార పత్రికల లోనూ అలాగే సప్తగిరి, మిహిర మొదలైన ఆధ్యాత్మిక పత్రికల లోనూ అచ్చయ్యాయి. వారు చాలా వ్యాసాలూ, శీర్షిక లూ, కధలూ కూడా వ్రాసి శ్రీ కాళీపట్నం రామారావు మొదలైన సాహిత్య దిగ్గజాల మెప్పు పొందారు. తన అనుభవం లోకి వచ్చిన చిన్నచిన్న సంఘటనలే ఇతివృత్తంగా తీసుకొని వాటిని రచనలుగా మలచడంలో దిట్ట.


(శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు అక్టోబర్ 22 కి డెబ్భై ఏడో వసంతం లోకి అడుగు పెట్టిన సందర్భంగా... ఆయురారోగ్యాలతో వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనీ వారిపై శ్రీ వేంకటేశ్వర కృప ఎల్లప్పుడూ ఉండాలనీ ప్రార్ధిస్తూ...- కుటుంబ సభ్యులందరి తరఫునా ...- రాధేశ్యాం )

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)