
ఈ నాటకం సినిమా రూపంలో ఎన్టీ రామారావు, సావిత్రి, సీఎస్సార్, మొదలైనవారు ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కింది. రంగస్థలం మీద కూడా ఎన్నిసార్లు వెయ్యబడిందో లెక్కలేదు.
ఆ సినిమా ఈ రోజు అప్పారావుగారి 97 వ వర్ధంతి సందర్భంగా స్థానిక గురజాడ కళా క్షేత్రం లో vuda వారి సౌజన్యంతో ప్రదర్శితమైంది. దానికి ముందు కళాకారులు కన్యాశుల్కం లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు. ఒక మూడు వందల మంది వచ్చి వుంటారేమో. కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసారు.
ఈ సినీమా మరియు నాటకం లో భాగాలను ప్రదర్శించే ఆలోచన ఎవరిదో కానీ, వారినీ వూడా అధికారుల్నీ మనస్పూర్తిగా అభినందించాలి. ఆ మహనీయునికి ఇలాంటి నివాళి ఇచ్చినందుకు.
ఈపుస్తకాన్నిఆర్కైవ్.ఆర్గ్ నుండి ఈ దిగువ లింక్ ని నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కన్యాశుల్కం నాటకం పీడీఎఫ్ రూపంలో
మొట్టమొదటి తెలుగు కథ గా చెప్పబడే 'దిద్దుబాటు' అప్పారావుగారి రచనే నని అందరికీ తెలిసిందే..!!
క్రింద బొమ్మలపై నొక్కి పెద్దవిగా చూడండి.
సంతోషం. కన్యాశుల్కం నాటకం - నవల కాదు, గమనించగలరు.
ReplyDeleteకొత్తపాళీ గారూ.. పొరపాటు సవరించాను. ధన్యవాదాలండీ..! :)
ReplyDelete