Showing posts with label రాజకీయం. Show all posts
Showing posts with label రాజకీయం. Show all posts

Sunday, February 10, 2013

ఏం చెయ్యాలి వీళ్ళని..!!

పరనింద పాపం అంటారు. ఆపాపం చెయ్యనిదే పాపం..మన రాజకీయ నాయకులకు పూట గడవదు. రోజూ క్రమం  తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ..తమ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలూ, వాగ్బాణాలూ, ఎకసెక్కాలూ, బూతులు తిట్టడాలూ, బురద జల్లడాలూ చేస్తూ ఉంటారు. వారికది నిత్యకృత్యం..! అలవాటైన ప్రాణం కదా..! ప్రొద్దున్నే టైం ప్రకారం తినడానికో తాగటానికో, ఏదో ఒకటి కడుపులో పడకపోతే ఎలా నీరసం వచ్చి వణుకు మొదలౌతుందో అలా అన్న మాట. పొద్దున్నే లేచి పేపరు చూడడం..,తమకు పనుకొచ్చే క్లిప్పింగు లన్నీ సేకరించి పార్టీ ఆఫీసు దగ్గరికొచ్చి ప్రెస్ మీట్ పెట్టి,  పైన చెప్పిన పనులన్నీ చెయ్యడం వాళ్ళ దినచర్య లో భాగం అయిపొయింది.

ఈ ప్రెస్ మీట్ వల్ల రెండు లాభాలు..! 
ఒకటి. సాధారణంగా ఇవన్నీలైవ్ గా ప్రసారం అయిపోతున్నాయి కాబట్టీ నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన పనిలేదు. ఎడిట్ చేసే సమయం ఉండదు కదా. అవతలి వాళ్ళు పచ్చి బూతులు తిడితే వీళ్ళు అమ్మనా బూతులు అందుకోవడం ద్వారా నోటి దురద తీరుతుంది.
రెండు. ముందురోజు ఎగస్పార్టీ వాళ్ళూ, (ఈమధ్య సొంతపార్టీ వాళ్ళుకూడా) తమ మీద చల్లిన బురద ని మళ్ళీ వాళ్లమీదికే తిరిగి చల్లేయ్యోచ్చు. ఖర్చు లేకుండా..!! (సో.. ఇద్దరూ బురద మొహాల్తోనే ఉండొచ్చు. హెచ్చు తగ్గులు లేకుండా..!)

పైరెండూ కాక  అతిముఖ్యమైన విషయం ఇంకోటుంది.
తమ నియోజక వర్గానికి సంబంధించిన ప్రజలతో ప్రత్యక్షంగా కలిస్తే అప్పుడప్పుడూ వాళ్ళు అడిగే ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాలి. అదే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలిసారనుకోండి..గ్లామరూ పెరుగుతుంది. పైన చెప్పిన ఇబ్బందీ ఉండదు. చచ్చినట్టు వీళ్ళు చెప్పేదంతా వినాలి. అంతేకాక రాష్ట్రప్రజానీకం మొత్తానికి తో సంబంధం ఏర్పడి చోటా నాయకుడు బడా నాయకుడిగా ఎదిగే అవకాశం కలుగుతుంది.

పైవన్నీ అలా ఉంచండి.
ఈ మధ్య రాజకీయాలలో ఒక చిత్రమైన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ఇదేదో ఒక్కరోజులో జరిగిపోయింది కాదులెండి. ఇంతకీ సంగతేమిటంటే.. ఒక విషయం మీద (అవినీతి అవ్వొచ్చు, కబ్జాలు అవ్వొచ్చు, హత్యా యత్నాలు అవ్వొచ్చు, బూతు సినిమాలు చూడడం కావొచ్చు..) ఫలానా ఘోరం చేసేస్తున్నారు బాబోయ్, ఇంతకన్నా నీచం మరిలేదు మహాప్రభో..అంటూ నిన్ననే కష్టపడి గొంతు చించుకొని అవతల వాళ్ళ మీద ఆరోపణలు చేసి జబ్బలు చరుచుకుంటే.. ఇవాళ స్వపక్షీయులే సరిగ్గా అలాంటి నీచపు పనో, తత్సమానమైన ఇంకో దిక్కుమాలిన పనో చేసి దొరికిపోతున్నారు. ఏతావాతా తేలేదేమిటంటే అందరూ ఆ తాను ముక్కలే అని..! ఒక వేలెత్తి వీళ్ళు అవతలి వాణ్ని చూపిస్తే మూడువేళ్ళు వీళ్ళని చూపిస్తూ ఉంటాయన్నమాట.  ప్రజలు మాత్రం ఎటూ మాట్లాడలేని బ్రొటన వేలులాగా భగవంతుడా నీవే రక్ష..! అనుకొంటూ ఆకాశం వైపు తెల్లమొహం వేసుకొని చూస్తూఉంటారు.

అధికార పక్షం వాళ్ళు "మా హయాం లో ముగ్గురు మంత్రులని పదవులు పీకి కోర్టుల్లో శిక్ష వేయించి జైల్లో పెట్టేశాం. మమ్మల్ని మించిన ధర్మ ప్రభువులు నభూతో.. "అనేస్తారు. ఇంకో పక్క ఈ స్కాం బయటకి రావటానికి కారణమైన వ్యక్తులని ఎన్ని అగచాట్లకు గురి చెయ్యాలో అంతా చేస్తారు. అయ్యా..! చెవిలో పువ్వులెవరికి పెడుతున్నారు..?? సాధ్యమైనంత వరకు స్వపక్షీయులని రక్షించడానికి ఎన్ని పనులు చేయాలో అన్నీ చేసి, కోర్టు చేత నానా తిట్లు తిట్టించుకొని, మొట్టికాయలు వేయించుకొని, ఇంక లాభంలేదు అన్న పరిస్థితిలో తప్పనిసరై తమ వారిని ఇంటికి పంపిస్తే, కోర్టు వారి ఆదేశాలు వారిని జైల్లో దిగపెడుతున్నాయి. దీనిలో పాలకపక్షం గొప్పతనం, ధర్మోద్ధరణ ప్రసక్తి ఎక్కడుంటుంది..??

దీంట్లో ఇంకో చిదంబర రహస్యం ఉంది. కోర్టులో శిక్షపడ్డాకే దోషి గానీ, అంతవరకూ నిర్దోషి గానే పరిగణించబడతారు.   ఒకడు పది సంవత్సరాల క్రితం లక్షరూపాయలు లంచం తీసుకొనో, ఆయన దగ్గర పని చేసే సెక్రెటరీని చంపేసో,  బోల్డు వాదోపవాదాల దరిమిలా కోర్టులో దోషిగా తేలి ఏడాది శిక్ష పడితే అతడు పై కోర్టు కి పోయి ఇంకో పదేళ్ళో లేక జీవితకాలమో అతని శిక్ష తప్పించుకోవడానికి కావలసిన వెసులుబాట్లు మన చట్టాల్లోనే ఉన్నాయి. ఈకాలంలో అతడు రకరకాల ప్రభుత్వ పదవులు వెలగబెట్టొచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభలకు ఎన్నికవ్వొచ్చు. నామినేటెడ్ పదవులు పొందొచ్చు. దేవుడు మేలు చేస్తే ముఖ్యమంత్రి, గవర్నర్ గిరీ లాంటి అత్యున్నత పదవులతో సహా అందుకోలేని అందలం ఉండదు. తద్వారా మరో "వందల కోట్లు ఆర్జించే" అవకాశాన్ని దర్జాగా వినియోగించుకోవచ్చు. చిట్టచివరికి అతడి నేరం రుజువై (అప్పటికే చట్టానికి అందని ఎత్తులోఉన్నా) శిక్ష పడినా అది ఆ వ్యక్తి చిన్నప్పుడు చేసిన శిక్ష కి  అనుగుణంగానే ఉంటుంది. అది  ఈ వ్యక్తి ఇప్పుడున్న స్థాయికి తుపుక్కని ఉమ్మేసిన పాటి. అంతేకాని నేరానికీ శిక్షకూ మధ్యకాలంలో ప్రభుత్వంవారు దయచేయించిన జీత భత్యాలూ, ఏసీ మర్యాదల్తో ప్రయాణాలూ, అవకాశం వచ్చిందికదాని ఇతగాడు పట్టేసిన వందల కోట్ల రూపాయలకూ ఆ మట్టి అంటదు.

ఈ పైన చెప్పిన యవ్వారాలన్నిటికన్నా ప్రమాద కరమైనది..పైన చెప్పిన మన నాయకులు బొత్తిగా బాధ్యత మర్చిపోయి, తమ ముందు మైకు ఉంది కదాని నోటికి ఎంతొస్తే అంత అనేయడం...! వాళ్ళు వాడే భాష ఎంత నీచం గా ఉన్నా , దాని పర్యవసానంగా రెండు కులాల మధ్య, మతాల మధ్య, లేదా ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఏర్పడి తద్వారా దేశ సమగ్రతకి భంగం కలిగే పరిస్థితి దాపురించినా.. వీళ్ళకు పట్టదు.  ఈ వ్యక్తులలో కొందరికి నోటి దూలతో పాటూ చేతి తీటా ఎక్కువే..! చెప్పిన పైలు వెంటనే అందించని తమ పర్సనల్ సెక్రెటరీ అయినా, తాము చెప్పిన వాళ్లకి అర్హత లేదన్న కారణంతో అప్పివ్వని బాంకు మేనేజరైనా, లేక సాక్షాత్తూ జిల్లా కలెక్టరే అయినా వీరికి చిర్రెత్తుకొచ్చిందంటే చాలు. తమ నోటికీ చేతికీ కూడా పని చెబుతారు.

యధా రాజా తథా ప్రజా అన్నారు..! బడానాయకుల్ని చూసి చోటా నాయకులు, వారిని చూసి వారి అనుచరులూ, ఒక్కరేమిటి, పైనుంచీ క్రిందదాకా అందరిదీ ఒకటే వ్యవహార శైలి..! సుగుణాలలోనూ, ఆదర్శాలలోనూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన పాతతరం 'దేశ'నాయకుల స్థానంలో అవినీతీ, గూండాగిరీలకు ముందుండి దిశా నిర్దేశం చేస్తున్న 'ఖల్' నాయకుల  ఆధ్వర్యం లో రాజకీయాలు నడుస్తున్నాయిప్పుడు..! నిరాడంబరుడు, స్నేహశీలి, ఆశాజ్యోతి, ప్రియతమ నాయకుడు లాంటి విశేషణాలు ఇప్పుడూ కనిపిస్తాయి... దిగువ శ్రేణి నాయకత్వం, వారి అధినాయకత్వాల జన్మదినాల సందర్భంగా ఊరంతా పరిచేసే ఫ్లెక్సీ లలో... నేతి బీరకాయ చందంగా..!!
 
ఇప్పుడు ప్రశ్న... వ్యవస్థను నిర్వీర్యం చేసి, దాని  పతనానికి కారకులయ్యే పై పెద్దమనుషులకి దేశద్రోహ నేరం అంటదా..??  ఏం  చెయ్యాలి వీళ్ళని..??
పూర్తిగా చదవండి...

Sunday, October 28, 2012

దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!

దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
ఈ డైలాగు వెనకటికి ఓ సినిమాలో ఒక పాత్ర అంటూ ఉంటుంది.
 ఈనాటి భారత రాజకీయ నాయకులని చూస్తూ ఉంటే..అధికార, విపక్షాల తేడాలేకుండా అందరూ అవినీతిలో కూరుకుపోయినవాళ్ళే..! ఆ మధ్య అక్కడ కేంద్రంలో టూజీ రాజా గారూ, కనిమోళీ, సురేష్ కల్మాడీ, మనరాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి, పక్కరాష్ట్రం లోని గా. జనార్ధన్ రెడ్డి ల సంగతులు తేలేలోగా, నిన్నటికి నిన్న, అదృష్టవశాత్తూ కొన్నాళ్ళు ఈ దేశప్రధానిగా కాలం వెళ్ళబుచ్చిన కర్నాటక రాష్ట్ర నాయకుడు దేవగౌడ, తాజా మాజీ సీఎం యడ్యూరప్ప మరియు ఇంకొందరి మీద ఆరాష్ట్ర లోకాయుక్త విచారణకు ఆదేశించింది.
శీమతి సోనియా గాంధీ గారి అల్లుడు రాబర్ట్ వాధ్రా గారు, డీ ఎల్ ఎఫ్ తో వారికున్న స్నేహాన్ని పురస్కరించుకొని వారికి ఓ నాలుగు ప్రాజెక్టులు ఇప్పిస్తే ఆ కంపెనీ వాళ్ళు ఈయనకి తమ లాభం కొంత పంచిచ్చారు అదే ఫ్రెండ్షిప్ కొద్దీ…! గడ్కరీ గారు ఎంతో ఉదారంగా తమ డ్రయివర్ ని ఒక పది కంపెనీలకి డైరెక్టర్ని చేస్తే పాపం ఆ డ్రయివరు రాముడు పది కంపెనీలకి డైరెక్టర్ని కదా అని తల ఎగరెయ్యకుండా మరింత శ్రద్ధగా తన డ్రయివరుగిరీ కొనసాగించి తన స్వామి భక్తినీ, విశ్వాస పాత్రతనూ చాటుకొన్నాడు…! ఈ రెండూ కూడా కొద్ది రోజుల వ్యవధిలో బయటకొచ్చిన సంగతులే. కొసమెరుపేంటంటే అల్లుడుగారికి క్లీన్ చిట్టూ, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులవారి మీద విచారణకు ఆదేశించడం, రెండు నిర్ణయాలూ ఆగమేఘాల మీదే తీసుకొన్నాయి ఆయా ప్రభుత్వాలు, లేదా వ్యవస్థలు. ఇవి చాలదన్నట్టు ఒక టీవీ చానెల్ వారికీ, ఒక ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తకూ మధ్య జరుగుతున్న తంతు కూడా రోత పుట్టిస్తోంది.
http://www.thefunlearning.com/2012/09/cartoons-against-corruption-in-india.html
 ప్రభుత్వాలలో, రాజకీయ పార్టీలలో, లేదా ఉన్నత స్థాయిలో జరిగే అవినీతి ఇలా ఉంటే రోజూ మన కళ్ళ ఎదురుగా జరిగే సంగతులు కొన్నిఇలా ఉంటాయి :
మనం రైల్వే స్టేషన్ కి మన బంధువులని తీసుకురావడానికి వెళ్తాము. అక్కడ మన కారు పార్క్ చెయ్యడానికి పది రూపాయలు తీసుకొంటాడు. మనం ఏదో ఒక విధంగా ఎగ్గొట్టడానికే చూస్తాము. రుసుము వసూలు చేసేవ్యక్తి కళ్ళుగప్పి చల్లగా జారుకోవడమో, లేక పార్క్ చేయలేదని, అసలు ఆగనేలేదని దబాయించడమో చేసి బోల్డు సంబర పడిపోతాము.  తనిఖీ జరగటం లేదని తెలిసిందా ప్లాట్ ఫాం టికెట్ అసలు తియ్యనే తియ్యం. కూరలు, పళ్ళూ అమ్మే చిరువ్యాపారుల దగ్గర వాళ్ళు పొరపాటున మనకి చిల్లర ఎక్కువ ఇచ్చేసినా గప్ చుప్ గా వెళ్ళిపోతాం. మనం కొన్న వస్తువుల జాబితాలోకి పక్కవాడి వస్తువు పొరపాటున కలిసిపోయిందనుకోండి.., మొదట బిల్లు లో అది కలిసిందా లేదా చూస్తాం. కలిస్తే నానా యాగీ చేస్తాం లేదా చాలా నిజాయితీ పరుడిలాగా ఫోజు పెట్టి అది మాదికాదని చెప్తాం. ఒకవేళ బిల్లు లో కలవక పోతే మాత్రం ఆహా ఇవాళ లేచిన వేళా విశేషం.. అనుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ’ఆమ్ ఆద్మీ అవినీతి’ జాబితా కొండవీటి చేంతాడంత అవుతుంది. అది ఉద్యోగం విషయంలో కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించడంలోకావచ్చు, బిల్లు కట్టడానికి క్యూలో నిలుచున్నప్పుడు కావచ్చు, . అవకాశం దొరికిన ప్రతీసారీ పక్కవాడి దాంట్లోంచీ చిలక్కొట్టుడు కొట్టేస్తాం. కానీ మన నిజాయితీ ఇమేజికి భంగం కలగ కుండా ’సమయానికి తగు మాటలాడి’ ఒక పకడ్బందీ సాకు వెదికి, తప్పు మనది కాదంటూ తీర్మానించి, అది అవతల వాడిమీదకి తోసేసి చేతులు దులుపుకొంటాం. 

 అంటే మనలో అందరూ లేదా చాలా మంది ఏదో ఒక విధమైన అవినీతిలో తెలిసో తెలియకో, కావాలనో లేక అసంకల్పితంగానో భాగస్తులమే అన్నది నిర్వివాదం. అందువల్ల ప్రొమోషన్ లిస్ట్ లో మనతోటివాళ్ళ కన్నా పైకి ఎగబాకడానికి పై లెవెల్లో లంచమిచ్చి మేనేజ్ చెయ్యడానికి వెనుకాడం.  డ్రైవింగ్ లైసెన్సో, పాస్ పోర్టో అర్జెంటుగా కావాలంటే  లంచమిచ్చి తెచ్చుకోవడాన్ని అవినీతిగా పరిగణించం. కానీ పేపర్లో రోజుకొకటి కనిపించే అవినీతిని మాత్రం చూసిమాత్రం గుండెలు బాదుకొని తీవ్రంగా నిరసిస్తాం. మళ్ళీ అవే రాజకీయ పార్టీలు ఏదైనా తాయిలాలు ఇస్తామంటే మాత్రం ఆ నాయకులు మనకు దైవ సమానులై  పోతారు. అంటే ఇందాక గుండెలు బాదుకున్నది దానిలో మనకు (మనం అంటే మనం అనే కాదు ఆ స్కాము వల్ల లబ్ధి పొందని/ పొందలేకపోయిన/ పొందడానికి అవకాశం రాలేని వాళ్ళందరూ ) భాగం రాలేదనా…!! ఇప్పుడు ఈ అవినీతిమయ రాజకీయ పార్టీలలోకి జరుగుతున్న వలసలూ, లేదా క్రొత్త సభ్యత్వాలూ జరుగుతున్నది ఆ పార్టీల / నాయకుల మీద ప్రేమా..??!! లేక ఆయన పంచన చేరితే అవినీతి సొమ్ములో ఆయన తినగా మిగిలిన ఎంగిలి మెతుకులైనా దక్కుతాయనే మోహమా..??!! ఓ నాలుగేళ్ళు అప్రెంటీసు చేసి ఆ కిటుకేదో కనిపెడితే భవిష్యత్తుకి ఢోకా ఉండదనే కపటమా..??!!
పూర్వం ఒకప్పుడు.., చాలా దశాబ్దాల క్రితం.., ప్రాచీన కాలంలో.., నాగరికత ఇంత అభివృద్ధి చెందని కాలంలో.., (అర్ధమయ్యేటట్టు చెప్పాలంటే.. మీకూ నాకూ మనలో ఎవ్వరికీ తెలియని కాలంలో) సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడనే పదాలు భగవంతుడికి పర్యాయపదాలుగా వాడేవారు. కలడు కలండనెడువాడు కలడో లేడో.. కానీ ఇప్పుడా పదాలు “అవినీతి భూతానికి” సరిగ్గా సరిపోతున్నట్టున్నాయి. ఎందుకనో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయ నాయకులూ, అధికారులూ, ఇంజనీర్లూ, కాంట్రాక్టర్లూ, స్వామీజీలూ, ఒక్కరేమిటి అందరూ ఆ తాను ముక్కలే. ఈ నేపధ్యంలో సృష్టి స్థితి లయ కారకుడైన భగవంతుడు స్థాణువై శిలామాత్రంగా మిగిలిపోతున్నాడు. 
ఒక్కడు బురదలో నడిస్తే గట్టున ఉన్నపదిమంది అసహ్యించుకుంటారు.., లేదా మొహం వాచేలా చీవాట్లు పెడతారు. అదే గట్టున ఉన్నది ఒక్కడూ, బురదలో నడుస్తున్నది పదిమంది అనుకోండి. గట్టున ఉన్న ఒక్కడినీ చూసి ఆ పదిమందీ పగలబడి నవ్వుతారు. ఇంకాస్త ముందుకెళ్ళి వాడికీ మకిలి కాస్త అంటించేసి వెక్కిరిస్తారు. ఇప్పటి రాజకీయాలు, అవినీతి బురద పూసుకొని, ఆ బురదని మరో పదిమందికి పూసి ఆ కుళ్ళు మొహాలనే నేటి తరం ఫ్యాషన్ గా చెలామణి చేసేస్తున్నాయి..! నిదర్శనం కావాలంటే సగటు భారతీయుడిని నేటి అవినీతిమయ రాజకీయాలపైన అభిప్రాయం చెప్పమనండి..! ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బాధపడేవాళ్ళ కన్నా, ఆ అవినీతికి సూత్రధారి అయిన పెద్దమనిషి తెలివితేటలకి అబ్బురపడే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ఈ లెవెల్ అవినీతికి ఆల్రెడీ ఆమోదముద్ర పడిపోయిందన్నమాటేకదా..! ముఖ్యంగా యువతలో..!!! 
నిజంగానే దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
http://www.thefunlearning.com/2012/09/cartoons-against-corruption-in-india.html

పూర్తిగా చదవండి...

దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!

దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
ఈ డైలాగు వెనకటికి ఓ సినిమాలో ఒక పాత్ర అంటూ ఉంటుంది.
 ఈనాటి భారత రాజకీయ నాయకులని చూస్తూ ఉంటే..అధికార, విపక్షాల తేడాలేకుండా అందరూ అవినీతిలో కూరుకుపోయినవాళ్ళే..! ఆ మధ్య అక్కడ కేంద్రంలో టూజీ రాజా గారూ, కనిమోళీ, సురేష్ కల్మాడీ, మనరాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి, పక్కరాష్ట్రం లోని గా. జనార్ధన్ రెడ్డి ల సంగతులు తేలేలోగా, నిన్నటికి నిన్న, అదృష్టవశాత్తూ కొన్నాళ్ళు ఈ దేశప్రధానిగా కాలం వెళ్ళబుచ్చిన కర్నాటక రాష్ట్ర నాయకుడు దేవగౌడ, తాజా మాజీ సీఎం యడ్యూరప్ప మరియు ఇంకొందరి మీద ఆరాష్ట్ర లోకాయుక్త విచారణకు ఆదేశించింది.
శీమతి సోనియా గాంధీ గారి అల్లుడు రాబర్ట్ వాధ్రా గారు, డీ ఎల్ ఎఫ్ తో వారికున్న స్నేహాన్ని పురస్కరించుకొని వారికి ఓ నాలుగు ప్రాజెక్టులు ఇప్పిస్తే ఆ కంపెనీ వాళ్ళు ఈయనకి తమ లాభం కొంత పంచిచ్చారు అదే ఫ్రెండ్షిప్ కొద్దీ…! గడ్కరీ గారు ఎంతో ఉదారంగా తమ డ్రయివర్ ని ఒక పది కంపెనీలకి డైరెక్టర్ని చేస్తే పాపం ఆ డ్రయివరు రాముడు పది కంపెనీలకి డైరెక్టర్ని కదా అని తల ఎగరెయ్యకుండా మరింత శ్రద్ధగా తన డ్రయివరుగిరీ కొనసాగించి తన స్వామి భక్తినీ, విశ్వాస పాత్రతనూ చాటుకొన్నాడు…! ఈ రెండూ కూడా కొద్ది రోజుల వ్యవధిలో బయటకొచ్చిన సంగతులే. కొసమెరుపేంటంటే అల్లుడుగారికి క్లీన్ చిట్టూ, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులవారి మీద విచారణకు ఆదేశించడం, రెండు నిర్ణయాలూ ఆగమేఘాల మీదే తీసుకొన్నాయి ఆయా ప్రభుత్వాలు, లేదా వ్యవస్థలు. ఇవి చాలదన్నట్టు ఒక టీవీ చానెల్ వారికీ, ఒక ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తకూ మధ్య జరుగుతున్న తంతు కూడా రోత పుట్టిస్తోంది.
http://www.thefunlearning.com/2012/09/cartoons-against-corruption-in-india.html
 ప్రభుత్వాలలో, రాజకీయ పార్టీలలో, లేదా ఉన్నత స్థాయిలో జరిగే అవినీతి ఇలా ఉంటే రోజూ మన కళ్ళ ఎదురుగా జరిగే సంగతులు కొన్నిఇలా ఉంటాయి :
మనం రైల్వే స్టేషన్ కి మన బంధువులని తీసుకురావడానికి వెళ్తాము. అక్కడ మన కారు పార్క్ చెయ్యడానికి పది రూపాయలు తీసుకొంటాడు. మనం ఏదో ఒక విధంగా ఎగ్గొట్టడానికే చూస్తాము. రుసుము వసూలు చేసేవ్యక్తి కళ్ళుగప్పి చల్లగా జారుకోవడమో, లేక పార్క్ చేయలేదని, అసలు ఆగనేలేదని దబాయించడమో చేసి బోల్డు సంబర పడిపోతాము.  తనిఖీ జరగటం లేదని తెలిసిందా ప్లాట్ ఫాం టికెట్ అసలు తియ్యనే తియ్యం. కూరలు, పళ్ళూ అమ్మే చిరువ్యాపారుల దగ్గర వాళ్ళు పొరపాటున మనకి చిల్లర ఎక్కువ ఇచ్చేసినా గప్ చుప్ గా వెళ్ళిపోతాం. మనం కొన్న వస్తువుల జాబితాలోకి పక్కవాడి వస్తువు పొరపాటున కలిసిపోయిందనుకోండి.., మొదట బిల్లు లో అది కలిసిందా లేదా చూస్తాం. కలిస్తే నానా యాగీ చేస్తాం లేదా చాలా నిజాయితీ పరుడిలాగా ఫోజు పెట్టి అది మాదికాదని చెప్తాం. ఒకవేళ బిల్లు లో కలవక పోతే మాత్రం ఆహా ఇవాళ లేచిన వేళా విశేషం.. అనుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ’ఆమ్ ఆద్మీ అవినీతి’ జాబితా కొండవీటి చేంతాడంత అవుతుంది. అది ఉద్యోగం విషయంలో కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించడంలోకావచ్చు, బిల్లు కట్టడానికి క్యూలో నిలుచున్నప్పుడు కావచ్చు, . అవకాశం దొరికిన ప్రతీసారీ పక్కవాడి దాంట్లోంచీ చిలక్కొట్టుడు కొట్టేస్తాం. కానీ మన నిజాయితీ ఇమేజికి భంగం కలగ కుండా ’సమయానికి తగు మాటలాడి’ ఒక పకడ్బందీ సాకు వెదికి, తప్పు మనది కాదంటూ తీర్మానించి, అది అవతల వాడిమీదకి తోసేసి చేతులు దులుపుకొంటాం. 

 అంటే మనలో అందరూ లేదా చాలా మంది ఏదో ఒక విధమైన అవినీతిలో తెలిసో తెలియకో, కావాలనో లేక అసంకల్పితంగానో భాగస్తులమే అన్నది నిర్వివాదం. అందువల్ల ప్రొమోషన్ లిస్ట్ లో మనతోటివాళ్ళ కన్నా పైకి ఎగబాకడానికి పై లెవెల్లో లంచమిచ్చి మేనేజ్ చెయ్యడానికి వెనుకాడం.  డ్రైవింగ్ లైసెన్సో, పాస్ పోర్టో అర్జెంటుగా కావాలంటే  లంచమిచ్చి తెచ్చుకోవడాన్ని అవినీతిగా పరిగణించం. కానీ పేపర్లో రోజుకొకటి కనిపించే అవినీతిని మాత్రం చూసిమాత్రం గుండెలు బాదుకొని తీవ్రంగా నిరసిస్తాం. మళ్ళీ అవే రాజకీయ పార్టీలు ఏదైనా తాయిలాలు ఇస్తామంటే మాత్రం ఆ నాయకులు మనకు దైవ సమానులై  పోతారు. అంటే ఇందాక గుండెలు బాదుకున్నది దానిలో మనకు (మనం అంటే మనం అనే కాదు ఆ స్కాము వల్ల లబ్ధి పొందని/ పొందలేకపోయిన/ పొందడానికి అవకాశం రాలేని వాళ్ళందరూ ) భాగం రాలేదనా…!! ఇప్పుడు ఈ అవినీతిమయ రాజకీయ పార్టీలలోకి జరుగుతున్న వలసలూ, లేదా క్రొత్త సభ్యత్వాలూ జరుగుతున్నది ఆ పార్టీల / నాయకుల మీద ప్రేమా..??!! లేక ఆయన పంచన చేరితే అవినీతి సొమ్ములో ఆయన తినగా మిగిలిన ఎంగిలి మెతుకులైనా దక్కుతాయనే మోహమా..??!! ఓ నాలుగేళ్ళు అప్రెంటీసు చేసి ఆ కిటుకేదో కనిపెడితే భవిష్యత్తుకి ఢోకా ఉండదనే కపటమా..??!!
పూర్వం ఒకప్పుడు.., చాలా దశాబ్దాల క్రితం.., ప్రాచీన కాలంలో.., నాగరికత ఇంత అభివృద్ధి చెందని కాలంలో.., (అర్ధమయ్యేటట్టు చెప్పాలంటే.. మీకూ నాకూ మనలో ఎవ్వరికీ తెలియని కాలంలో) సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడనే పదాలు భగవంతుడికి పర్యాయపదాలుగా వాడేవారు. కలడు కలండనెడువాడు కలడో లేడో.. కానీ ఇప్పుడా పదాలు “అవినీతి భూతానికి” సరిగ్గా సరిపోతున్నట్టున్నాయి. ఎందుకనో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయ నాయకులూ, అధికారులూ, ఇంజనీర్లూ, కాంట్రాక్టర్లూ, స్వామీజీలూ, ఒక్కరేమిటి అందరూ ఆ తాను ముక్కలే. ఈ నేపధ్యంలో సృష్టి స్థితి లయ కారకుడైన భగవంతుడు స్థాణువై శిలామాత్రంగా మిగిలిపోతున్నాడు. 
ఒక్కడు బురదలో నడిస్తే గట్టున ఉన్నపదిమంది అసహ్యించుకుంటారు.., లేదా మొహం వాచేలా చీవాట్లు పెడతారు. అదే గట్టున ఉన్నది ఒక్కడూ, బురదలో నడుస్తున్నది పదిమంది అనుకోండి. గట్టున ఉన్న ఒక్కడినీ చూసి ఆ పదిమందీ పగలబడి నవ్వుతారు. ఇంకాస్త ముందుకెళ్ళి వాడికీ మకిలి కాస్త అంటించేసి వెక్కిరిస్తారు. ఇప్పటి రాజకీయాలు, అవినీతి బురద పూసుకొని, ఆ బురదని మరో పదిమందికి పూసి ఆ కుళ్ళు మొహాలనే నేటి తరం ఫ్యాషన్ గా చెలామణి చేసేస్తున్నాయి..! నిదర్శనం కావాలంటే సగటు భారతీయుడిని నేటి అవినీతిమయ రాజకీయాలపైన అభిప్రాయం చెప్పమనండి..! ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బాధపడేవాళ్ళ కన్నా, ఆ అవినీతికి సూత్రధారి అయిన పెద్దమనిషి తెలివితేటలకి అబ్బురపడే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ఈ లెవెల్ అవినీతికి ఆల్రెడీ ఆమోదముద్ర పడిపోయిందన్నమాటేకదా..! ముఖ్యంగా యువతలో..!!! 
నిజంగానే దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
http://www.thefunlearning.com/2012/09/cartoons-against-corruption-in-india.html

పూర్తిగా చదవండి...

Monday, March 14, 2011

జరిగింది..విగ్రహ విధ్వంసమా లేక...

సంఘటన జరిగినప్పటి నుంచి.. రెండుప్రాంతాల వారి బ్లాగులూ చదువుతూనే వున్నాను. ఇక్కడ విషయాన్ని రెండు పక్షాలవారూ రెండు దృక్కోణాలనుంచి చూస్తున్నారని పిస్తోంది. క్షమించాలి.. మమందరం మొదట భారతీయులం ఎలాగో..అలాగే మన ప్రాంతీయత కంటే ముందు మనందరం తెలుగు వాళ్ళం అని నమ్మేవాడిని నేను. రెండు విరుద్ధ భావనల్నిప్రతిబింబించే వాదనలు చేస్తున్నపక్షాలని రెండు గా వేరుచేసి చూడవలసి వస్తోంది. ఇక్కడ రెండు పక్షాలు అంటే.. తెలంగాణా, సీమాంధ్ర అని కాదని మనవి. ఆ విగ్రహాలకి ప్రాంతీయతని ఆపాదించకుండా తెలుగు జాతి సాంస్కృతిక వారసత్వానికీ, వారు ప్రతిపాదించిన విలువలకీ ప్రతీకలుగా భావించే వారు (ఇలాంటి భావన కలిగిన తెలంగాణాకు చెందినా వారి బ్లాగులను చూసాను) ఒక పక్షం అయితే.. ఆ విగ్రహాలని కేవలం ప్రాణం లేని బొమ్మలుగా, తమ మీద రుద్దబడిన తమది కాని చరిత్ర గా మాత్రమే భావించి తీవ్రమైన భావావేశం తో పరుష పదజాలం తో మొదటి పక్షం మీద విరుచుకు పడుతున్నపక్షం రెండోది. ఈ 'బ్లాగ్యుద్ధం' ఎంతదాకా వెళ్లిందంటే ఆఖరుకి దేవుళ్ళనీ..ఫ్లై ఓవర్లనీ కూడా ప్రాంతీయత పేరుతో వేరుచేసే దాకా..!!



ఇక్కడ ఈ రెండో వర్గం చేసిన, చేస్తున్నయాగీ, అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టు ఉంది. తెలుగు భాషా సౌరభాన్ని గుబాళింప జేసి, వారి రచనల ద్వారా తెలుగు ప్రజల మనోవికాసానికి కృషి చేసిన ఆ వైతాళికులు విశ్వమానవులు. వారు ప్రతిపాదించిన విలువలను వారి జీవితం లో ఆచరించి చూపిన పుణ్యాత్ములు. అలాంటి మహాత్ముల విగ్రహాలను ధ్వంసం చెయ్యడం ద్వారా వీరు సాధించ దలచిందేమిటి..? ఆ రోజు, మరియు దానికి ముందు జరిగిన సంఘటనల నేపధ్యం లో ఈ విగ్రహ ధ్వంసం..క్షణికావేశం లో జరిగినదే అని సమాధాన పడదామన్నా..దాని తరువాత వస్తున్న సమర్ధింపులు ఏ రకంగా అంగీకారయోగ్యం..?? ఇదంతా ఈ రాజకీయ నాయకులు వారి ఉనికి కోసం చేసే దిగజారుడు చర్యలనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తపించేవారి ఆవేదనని అర్ధం చేసుకున్నా, ఇలాంటి వికృత చేష్టలకి పాల్పడే వారిని రకంగా అర్ధం చేసుకోవాలో తెలియదు. పైగా వారు సమస్యకి మూల కారణమైన రాజకీయ నాయకులని వదలి కవులు, కళాకారుల విగ్రహాలను కూలగోట్టడం..ఎక్కడి వీరోచిత కార్యమో అర్ధంకాదు.


హిందూ - ముస్లిం లు ఇక్యం గా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని, మహమ్మద్ అలీ జిన్నా యొక్క కుటిల రాజనీతి ఏ రకంగా కలుషితం చేసిందో మనకు తెలుసు. మనస్సులో విషబీజాలు నాటి, రెండు మతాల మధ్య సృష్టించిన అగాధంలో తమ విజ్ఞతని పాతిపెట్టి, కలసి పని చేసిన మిత్రులు, సోదరుల్లా మెలిగిన వారే తోటివారి రక్తాన్ని కళ్ళ జూసే స్థాయికి దిగజారి మానవత్వాన్ని మంటగలిపిన ఉదంతాలు మనం చూశాం. విద్వేషం..అది రగిల్చిన వారికంటే అనుభవించిన వారికే ఎక్కువ ప్రమాదకరం.

ప్రత్యేక రాష్ట్రం కోసం సమిధలైన వారిని గురించి బాధపడని మానవతావాదులకు ఈ ప్రాంతం లో కొదవు లేదు. 600 మంది అమరులైనారని తలచుకున్న ప్రతీసారీ గుండెలు పిండినట్టవుతుంది. అదే రీతిలో ఏమాత్రం ఉద్యమానికి సంబంధం లేని వారి విగ్రహాలను కూలగొట్టడం కూడా బాధ కలిగిస్తుంది. కానీ ఈ చర్య వల్ల విచక్షణ మర్చిపోయి తెలంగాణాకు చెందిన మన సోదరులనందరినీ ఒకే గాటన కట్టి, ద్వేషపూరిత భావాలతో మన మనసుల్ని కలుషితం చేసుకోవడం..ఏ రకం గానూ సమర్ధనీయం కాదు. కుల,మత,వర్గ, రహితమైన.., ప్రాంతీయ విభేదాలను దరిచేరనివ్వని.., సమ సమాజ స్థాపనకై కలలుగన్న ఆ మహనీయులకు 'లేని' ప్రాంతీయతని ఆపాదిస్తే అది విశ్వవ్యాప్తమైన వారి వ్యక్తిత్వాన్ని అంగుష్ఠ మాత్రం చెయ్యబూనటమే. గాంధీని, తిలక్ నీ, అంబేడ్కర్ని, వీర శివాజీనీ, ఏదో ఒక మతానికీ, వర్గానికీ, కులానికీ, ప్రాంతానికీ మాత్రమే ప్రతినిధులుగా ఆలోచించే సంకుచిత మనస్తత్వం వల్ల మన తరువాతి తరానికి మనం ఇస్తున్నది ఏమిటో తెలుసుకో గలిగితే వొళ్ళు గగుర్పొడుస్తుంది. నాయకులుగా మనం నమ్మిన వారి విలువలని పంచటం లేదు సరికదా.. వైషమ్యాలని పెంచి వారికి విషాన్ని పంచుతున్నాం. ప్రేమ, సహనం, సౌభ్రాతృత్వం, లాంటి భావాలకి వారిని దూరం చేస్తున్నాం. అరవయ్యేళ్ళు అయినా ఇంకా మన పొరుగు దేశానికి చెందిన వారు ఇంకా మన మీద విరుచుకు పడడానికి ప్రయత్నిస్తున్నారంటే.. వారి భావజాలం యొక్క మూలాలు (విత్తనం), ఎంత ప్రమాదకరమైనవో తెలుస్తోంది.


తమ చరిత్ర నిర్మించుకోవాలనే ఆరాటం లో మన మూలాలను ప్రక్కవారివి గా భావించి, వాటి సమాధులని తమకు పునాదులుగా వాడుకోవాలని చూస్తే చరిత్ర హీనులు కాకతప్పదు. వేరు పడాలనే ఒకే ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పుడు చెప్పే 'మా ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లేదు..కనుక వేరు పడాలి అనుకుంటున్నాం.. ' లాంటివాక్యాలు రేపు..రాష్ట్రం ఏర్పడ్డాక మండలాల వారీగా ప్రాతినిధ్యాలకి జవాబు చెప్పేటప్పుడు.. మనమంతా ఒకటే కదా..అని పాలకులు అనకా తప్పదు ..! "లేదు.. మాకు ప్రత్యేకం ఉండాల్సిందే " అని పోరుపెట్టే చోటా నాయకులకూ కొదవుండదు.

ఏదైనా మనం చూసే దృష్టిలోనే మనం గ్రహించే విషయం ఉంటుందనేది సుస్పష్టం..! అందమైన జాబిల్లిని మారుతున్న కళలతో చూడవలసి రావడం భూమినుంచి చంద్రుడిని మనం చూసే స్థిరమైన దృక్కోణం వల్లనూ, మరియు ఖగోళ భౌతిక శాస్త్ర నియమాల వల్లనే అనేది జగద్విదితం. కానీ చంద్రుడికి తన వెలుగులను పూర్తిగా పంచటం లేదని సూర్యుడి మీద అలుక పూనటం అవివేకం.
పూర్తిగా చదవండి...

Sunday, November 28, 2010

రాజకీయ ప్రేక్షకుడు..!!

ఈ మధ్యే ఓ మిత్రుడు ఒక sms పంపాడు. అది ఏమంటే : what is INDIA? A Nation where PIZZA reaches home faster than AMBULANCE and POLICE...! Where you get CAR LOAN @8% but EDUCATION LOAN @ 12%..!! Where a Kilo ONION is Rs. 24/- but SIM CARD is free..!!! Where people worship GODDESS DURGA.. but want to kill their GIRL CHILD. Olympic SHOOTER wins GOLD, Govt. gives 3 Crore, another SHOOTER dies fighting with TERRORIST, Govt. pays only 1 LAKH to that AMAR JAWAN's Family ..!!!! really Incredible INDIA....!!!!!
forward it until it reaches the PM
అదీ విషయం!!
అంతేనా అనేశారా..? చిన్న నవ్వు కూడా వచ్చిందా?? మావాడే.. సరీగా అర్ధం చేసుకోడు..! ఆవేశం ఎక్కువ..!!
అంతేనా.. అంటే ఇంకా వుందండీ..! అంటూ మరో ఇన్ని ఏకరువు పెడతాడు..!! ఇలాంటి చిన్న చిన్న విషయాలని భూతద్దం తో చూసి బుర్రపాడుచేసుకుంటాడు. ఈ sms చూసి నేను నవ్వొచ్చిందంటే.. వాడు బ్లడ్ బాయిల్ అయిపోతోందంటాడు..! PM గారు పాపం ఆయనే బోల్డు తలనెప్పుల్లో వుంటే ఇంకా ఇబ్బంది పెడతానంటాడు..వీడేం బాధ్యత గల పౌరుడండీ..!!
ఇప్పుడూ..
అట్టహాసంగా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది...'వెయ్యో పదో లంచం తీసుకుంటూ red handed గా పట్టుబడ్డ ఫలానా..ACB వలలో చిక్కిన వైనం..' మొహం దాచుకుంటూ.. కెమెరా కంట పడకుండా తప్పించుకొనే ప్రయత్నం లో ఉన్న సగటు ఉద్యోగి.. !! ఆ మొహం సరిగ్గా కనపడేలా చేతుల్ని అడ్డం తీసే అధికారులూ..!! రోజంతా అదే చూపిస్తారు..!!!
ఇంకో పక్క లక్షల కోట్ల స్కాం లకు సూత్రధారులు..పాత్రధారులూ ఐన మన నాయకమ్మన్యులు..!! సాక్ష్యాలు అన్నీఎదురుగా కనిపిస్తున్నా...
బోరవిరుచుకొని మరీ 'నాకేమీ తెలీదు..ఇదంతా ప్రతిపక్షాల కుట్ర...' అని దబాయించేసి ( సారీ..ఉన్నమాట చెప్తే, అది 'నిజం' అవుతుంది కానీ.. దబాయింపు ఎందుకవుతుందీ?? అంచేత 'వక్కాణించి' అని చదూకోండి.. ) నవ్వుతూ..జోకులేస్తూ..కాలరెగరేసి మరీ దర్జాగా కారెక్కే L. మోడీలూ, కల్మాడీలూ !!
'కక్కుర్తి పడితే కడుపైనా నిండాలంటారు'... ఈ సామెత 'పై ఇద్దర్లో' మొదటాయనకి తెలిసినట్టు లేదు..బొత్తిగా మొహమాటం..!!
రెండో అతను ధర్మదాత !! తాను తినీ మరో పదిమందికి పెట్టే పుణ్యాత్ముడు..!! ఆ సామెతని పదిసార్లు చదూకొని మరీ తత్వం బోధపరుచున్న (స్వయం)కృషీవలుడు !! 'దేశాన్ని దోచేస్తున్నారో' యని అరవక్కర్లేదు కనీసం సణుగుడు వినిపించినా కూడా కారుదిగి మరీ ' చట్టం తన పని తాను చేసుకు పోతుంది..ఈ స్కాం తుదికంటా దర్యాప్తు జరిపించి..ఎంతటి వాడి మీదైనా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చే పెద్దమనిషి!!
దేశంలో ఇలాంటి మామూలు విషయాలకి ఆశ్చర్యపోయి, నోరెళ్ళబెట్టి, తెగాలోచించేసి, ఆవేశం తెచ్చుకోడం ప్రయోజకత్వం కాదురా అబ్బాయి అంటే మా వాడికి అర్ధం కాదేం...?? పాయింటు సరిగ్గా కాచ్ చేసినట్టు లేదు ..

బస్సు స్టాప్ లో జేబుకోడుతూ ఒక దొంగ దొరికాడనుకోండి..వాడిని అక్కడే స్తంభానిక్కట్టేసీ దేహశుద్ధి చేస్తాం..! కొన్నిప్రాంతాల్లో చచ్చేదాకా కొడతారు. అది మన జన్మహక్కు కదా..!! అదే ఏ MLA గారో, ముఖ్యమంత్రిగారో.. ఒక పెద్ద స్కాం చేసారనుకోండి..పాపం పదవి కూడా పోయిందనుకోండి..వారిని నెత్తి నెక్కించుకొని ఓటేసి మరీ వారిని మళ్ళీ ముఖ్యమంత్రి గానో కేంద్ర మంత్రి గానో..ప్రోమోట్ చేసేసి వారి ప్రయోజకత్వానికి..అంగీకార ముద్ర వేసేస్తాం. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకా పెద్ద స్కాం చేసేసరికి.. చిన్న దెబ్బ మీద పెద్ద దెబ్బలాగా పాతది మర్చిపోతాం..!! ఈ పెద్దమనుషులంత గణిత శాస్త్ర వేత్తలు మరొకళ్ళు లేరు. అంకెల్లో ఒకదాని కంటే పెద్దది ఇంకోదాన్ని ఉపయోగం లోకి తెస్తున్నారు. కొత్త అంకె పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలా అని మన లెక్కెట్టుకొనే లోపల ఇంకా పెద్దది వాడుక లోకి తెచ్చేస్తున్నారు. ఈ తరహా applied mathematics మామూలు గణిత శాస్త్రవేత్తలకి చేత అవుతుందా చెప్పండి??
అయిదారేళ్ళ క్రితం 12 కోట్లు సోమ్ములుపోనాయి మరేటి సేత్తాం అంటూ మనకంటే ఎక్కువ ఆశ్చర్యం, అమాయకత్వం (ప్రెస్ మీట్ పెట్టి మరీ...) ఒలకబోసిన మంత్రి గారిని చూసి గుండెలు బాదేసుకున్నాడు మావాడు..!! ఇప్పుడీ లక్షా డెబ్భైఆరు వేల కోట్లు స్కాం చూసి ఏమైపోతాడో.. పాపం !!! నేనంటానూ...అయిదారేళ్ళలో 12 కోట్ల టర్నోవర్ ని, సున్నాలు చుట్టలేనంత స్థాయికి తీసుకెళ్లడం.. ఆహా!! ఏం ఘనత..ఏం అభివృద్ధి...!!!

ఇలాంటివి చూసీ జీర్ణించుకోలేక ఏదోరకంగా తన గొంతు విప్పాలనిపించీ బుల్లి తెర పంచాయితీకి (అదే మన TV Talk Show) వెళ్ళాడు. లోకల్ కాదండోయ్...నేషనలే!! అంత పేరున్నవాడు కాదు కాబట్టీ ప్రేక్షకుడిగా రానిచ్చారు. పానెల్ సభ్యులుగా ప్రముఖ రాజకీయ పార్టీల నుంచీ పేరెన్నిక గన్న పెద్దలూ, మేధావులూ..విచ్చేశారు.
టాపిక్ మొదలైనదే ఆలస్యం.. అందరూ ఒకటే అరుపులూ, కేకలూ.. ఎవరేం మాట్లాడుతున్నారో ఏమీ అర్ధం కాలేదు. ఈలోగా బ్రేక్...! విపక్షం వాళ్ళు జరిగిన స్కాం గురించి అడిగితే మీకసలు అడిగే అర్హత లేదన్నారు...ఈ పక్షం వాళ్ళు! మీ నిర్వాకం ముందు మాదెంతని కడిగేశారు..! జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామని వీరంటే.. విషయం అంత పెద్దదేమీ కాదని తేల్చేసారు..!! (దీనికన్నా పెద్దది వండి వార్చడానికి రంగం అప్పటికే సిద్ధం అవుతోందేమో!!) ఒకవేళ చెయ్యవలసి వస్తే మీ హయాం లో జరిగినవన్నిటి మీదా దర్యాప్తు చేసినతర్వాత మా వంతంటారు..!! ఏంకర్ తన దగ్గరున్న సాక్ష్యాల లాంటి documents అన్నీ ఏకరువు పెడితే 'అవన్నీ కోర్టు, దర్యాప్తు సంస్థల పరిధి లో వున్నాయి కాబట్టీ' మాట్లాడకూడదంటారు. . రాజ్యాంగ వ్యవస్థని, చట్టాల్ని మరింత పటిష్టం చేయాలంటారు..మళ్ళీ ఇంకో బ్రేక్..!! తర్వాత ప్రేక్షకుల వంతు..ప్రశ్నలడిగారు...సమాధానం మాత్రం లేదు..! మావాడూ అడిగాడు... అందరూ ఘొల్లున నవ్వారు. మొహమాటానికి మావాడూ నవ్వాడు. అన్ని లక్షల కోట్ల వ్యవహారాన్నీ సింపుల్ గా నవ్వులతో ముగించి...గట్టిగా చప్పట్లు కొట్టేసారు...!! అందరికీ చెయ్యిచ్చి... స్వపక్షం, విపక్షం చెట్టా పట్టాలేసుకొని...వారి వారి వాక్పటిమని తలుచుకుంటూ గర్వంగా కారేక్కేసారు..!!! మనం మళ్ళీ మన అలవాటైన ప్రేక్షక పాత్ర లో జీవిస్తూ తరిస్తాం. *****
ఇప్పుడే ఇంకో SMS వచ్చింది :
Most of the 1st Class students get technical seats, become doctors and engineers.

some of the 2nd class, pass MBA become Administrators and controll the 1st class!

some of the 3rd class enter politics, become ministers and control them both..!!

and some of the failures join the under world and control them all....!!!

శుభం!
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)