Friday, May 3, 2013

మతిపోయే కాంబినేషన్..!

  
ఎన్టియారు, జగను, చిన్నెంటియారునూ,
ప్రక్కప్రక్క నుండె వింతగొలుప
ఆవరుస ముందుండె రాజశేఖర్రెడ్డి
విజయమ్మ, షర్మిలయె వెంట నుండ
చేరె ప్రభాసూ, మహేషు బాబుల జంట
ఇంకెంద రొచ్చెదరొ వేచిచూడ

అసాధ్యమౌనట్టి ఈ కాంబినేషన్ ను
సుసాధ్యమొనరించె అభిమానులే! మరి
ఏ ముఖముదే పార్టి, ఏపార్టి దే ముఖమొ 
తెలియరాలేక ప్రజ తెల్లబోయె..!


పూర్తిగా చదవండి...

Saturday, April 6, 2013

మత్తకోకిల వృత్తమందున మున్ను వ్రాసిన పద్యమూ..!

పద్యాల నడక మీద శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారి వివరణాత్మకమైన వ్యాసం (ఛందస్సు తో నడక - 3) చూసాక చాలా బోల్డు ఇన్స్పిరేషన్ వచ్చేసి నేనూ ప్రయత్నించాను. ముఖ్యంగా ఆయన చెప్పిన'తాన తానన  తాన తానన  తా తానన  తాననా' నడక వినగానే మొదట స్ఫురించినది :
అల్లు రామలింగయ్య మీద చిత్రీకరింపబడిన పాట:  'అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమె భామినీ' 
నేను వ్రాసినది పంపితే వారు దోషాలు ఎత్తి చూపి సరిదిద్దుకోవడానికి సహకరించారు.
******************************
  1. కామేశ్వర రావు గారికి,
    మీ వివరణ చాలా బాగుంది. ధన్యవాదాలు. నాకు ’తాన తానన తాన తాన’ మీటరే సులువనిపించింది.
    నేనుకూడా ప్రయత్నించాను(మొట్టమొదటి సారి). మీ అభిప్రాయం తెలుపగలరు:

    నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
    గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
    పండు వెన్నెల మోము గల మా పాప నిద్దుర చెదరగా
    దిండు సర్దుచు జోలపాడు మదీయ శ్రీమతి! చూడగా


  2. మత్తకోకిల వృత్తమందున మునుపు వ్రాసిన పద్యమూ
    చిత్తమందున తలపుకొచ్చుట చిత్రమూ బహు చిత్రమూ
    వృత్తవివరణ చాలబాగుగ విశదపరచిన భైరవా..
    కొత్త నాకిది తప్పులున్నచొ కాయుమో కామేశ్వరా..!


  3. ప్రాసయతులన నాకు దెలియదు పట్టులేనిది సత్యము
    గ్రాసమిప్పుడు నాదు మెదడుకు గట్టిగా నే పూనగా
    దోస వేసిన చందమున పద్దెములనే నే కూర్చగా
    దోసమున్నచొ పెద్దమనసుతొ దిద్దిపెట్టు కవీశ్వరా..!


  4. రాధేశ్యామ్ గారూ,
    చాలా సంతోషమండి. మత్తకోకిల నడకని చక్కగా పట్టుకున్నారు!
    అయితే మీ పద్యాలు కచ్చితమైన మత్తకోకిల వృత్తంలో ఉన్నవని చెప్పలేము, సరిగ్గా అలాగే ఉండే మాత్రాఛందస్సులో ఉన్నాయి. ఈ తేడా తెలియాలంటే తర్వాతి టపా "ఛందస్సుతో నడక - 4" చదవండి. :-)
    కామేశ్వర రావు గారూ, మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు.
    "ఛందస్సుతో నడక - 4" చదివాను. మత్తకోకిల నన్ను గట్టిగానే ఆవహించింది. నా పద్యాలు కొద్దిగా సరిచేసాను(అని అనుకొంటున్నాను). చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

    నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
    గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
    పండు వెన్నెల సాటిరాగల పాప నిద్దుర పుచ్చగా
    దిండు సర్దుచు జోలపాడెడు దల్లియేగద కోయిలా!

    మత్తకోకిల వృత్తమందున మున్ను వ్రాసిన పద్యమూ
    చిత్తమందు తలంపుకొచ్చుటె చిత్రమూ బహు చిత్రమూ
    వృత్తలక్షణ మర్మమెల్లను వ్యక్తపర్చిన యొజ్జవే ..
    కొత్త నాకిది తప్పులున్నచొ కోపగింపక గావవే!

    ప్రాసయతులన నాకు దెల్వదు పట్టులేనిది సత్యమూ
    గ్రాసమిప్పుడు నాదు మేథకు పట్టువచ్చుట తథ్యమూ
    దోశ క్రొత్తగ వేయురీతిగ తెల్గు పద్దెము కూర్చగా
    దోసమున్నచొ, నీకు మ్రొక్కెద, దిద్దిపెట్టు కవీశ్వరా..!


    శ్రీ గురుభ్యోనమః
    ప్రణామాలతో
    రాధేశ్యామ్
    మళ్ళీ తప్పింది..ఈసారి ఇది చూడండి గురువుగారూ..!
    ప్రాసయన్నది నాకుదెల్వదు పట్టులేనిది సత్యమూ
    గ్రాసమిప్పుడు నాదుమేథకు పట్టువచ్చుట తథ్యమూ 
    దోశ కొత్తగ వేయురీతిగ దెల్గుపద్దెము కూర్చగా
    దోసమున్నచొ, నీకు మొక్కెద, దిద్దిపెట్టు కవీశ్వరా..! 
    రాధేశ్యామ్ గారూ,
    బాగున్నాయండి. ఇప్పుడు మత్తకోకిల గణాలన్నీ సరిపోయాయి. దోశలు తిప్పడం బాగా వచ్చినట్ట! :-) మొదటి పద్యంలో భావం కూడా చాలా బాగుంది. అన్ని పద్యాలలోనూ ప్రాస కూడా సరిపోయింది. కొన్ని చోట్ల యతులు మాత్రం సరిపోలేదు. యతిలో అచ్చు మైత్రి, హల్లు మైత్రి అని రెండుంటాయి. ఇంచుమించు అన్నిచోట్లా హల్లు మైత్రి కుదిరింది కాని అచ్చు మైత్రి కుదరలేదు. యతి గురించి వివరణ యిక్కడ చూడండి:
     
    వామ్మో..! ఇన్నున్నాయంటే చిక్కుపడకపోదునే..!!
    అయిననూ ప్రయత్నించెదను..!! :)
    మీ సలహాలకు ధన్యవాదాలండీ..చాలా నేర్చుకోగలుగుతున్నాను. 
     
    వృత్త లక్షణం ప్రకారం యతి సరిపోలేదని అన్నాను కాని, పద్యాలు చదువుకోడానికి చక్కగా ఉన్నాయి. కాబట్టి వీటిని మార్చనవసరం లేదు. కొత్తగా వ్రాసేటప్పుడు యతి గురించి దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. నా ఉద్దేశంలో నడక చక్కగా కుదిరి, మంచి భావాలతో వ్రాయగలిస్తే అవి మంచి పద్యాలే, యతి సరిపోకపోయినా.. 
    మరి మార్చక్కర్లేదన్నారు, ఇహ ఇబ్బంది పెట్టను..!
    ధన్యవాదాలు గురువుగారూ..! నేనప్పుడే మీరిచ్చిన లింకుతో డా. ఫణీంద్ర గారి బ్లాగరమథనానికి పూనుకొనేశా..!!
     - రాధేశ్యామ్
     ******************************
    తెలుగు పద్యం బ్లాగు నడుపుతున్న శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారికి, వారి బ్లాగులో 'సులువుగా పద్యం వ్రాయండి ... ' శీర్షిక నడుపుతున్న డా. ఆచార్య ఫణీంద్ర గారికి, పద్యమంజూష బ్లాగు నడుపుతున్నటేకుమళ్ళ వేంకటప్పయ్య గారికీ నా నమస్సులు..! పద్య రచనా  నియమాలను, తత్సంబంధమైన ఎన్నో ఆసక్తికరమైన  విశేషాలను  ఔత్సాహికులకు సులభ గ్రాహ్యంగా అందిస్తున్న వీరూ, వీరివంటి మరెందరో మహానుభావులకు వందనాలర్పిస్తున్నాను.   
     
పూర్తిగా చదవండి...

Monday, April 1, 2013

తి తి దే సమర్పిస్తున్న 'నాదనీరాజనం' కార్యక్రమంలో నామ సంకీర్తనం - ప్రసార సమయం


తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమం లో నా శ్రీమతి రుద్రావఝల కుసుమ కుమారి మరియు బృందం 'నామసంకీర్తన' గానం చేశారు. కార్యక్రమం ఈనెల 18వ తేదీన సాయంత్రం జరిగింది.  ఆరోజు శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో SVBC చానెల్ లో వీరి నామ సంకీర్తన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించలేదు. ఈరోజు ప్రసారం అవుతుందట ...!
ప్రసార సమయం : 
ఈరోజు (తే. 1.04.13) మధ్యాహ్నం 3:00 గం నుంచి 4:00 గం వరకు
 ******************************************
ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు ఈక్రింది లింక్ ను ప్రసార సమయం లో క్లిక్ చేస్తే ప్రసారం అప్పటికప్పుడే చూడవచ్చు.
http://www.yupptv.com/svbc_channel_live.html (పూర్తి కార్యక్రమం)
పాల్గొన్న కళాకారులు:
శ్రీమతి రుద్రావఝల కుసుమకుమారి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల, కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, చి. కృష్ణప్రియ, చి. విష్ణుప్రియ, చి. శ్రుతి, చి. భవ్య, గాయత్రి, ప్రశాంతి, కామేశ్వరి, మనోహర్ 
వాద్య సహకారం: వయొలిన్: శ్రీ హెచ్.  రామ్ చరణ్, మృదంగం: జయదీప్, వేణువు: శ్రీ శైలపతి భరద్వాజ్
బృందం లోని కళాకారులంతా ప్రముఖ గాత్ర సంగీత విదుషీమణి శ్రీమతి మండ సుధారాణి గారి శిష్య ప్రశిష్యులే..!
 


కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, కుమారి కామేశ్వరి, శ్రీమతి కుసుమకుమారి, కుమారి గాయత్రి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల




చి. శ్రుతి, చి. కృష్ణప్రియ,  ప్రశాంతి
చి. విష్ణుప్రియ, మనోహర్, చి. భవ్య,
శ్రీయుతులు శైలపతి భరద్వాజ్, రామ్ చరణ్ 
శ్రీ జయదీప్









*****************************************
కార్యక్రమం తరువాత తి తి దేవస్థానం వారు కళాకారులందరికీ ప్రసాదాలు ఇచ్చి , శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. కులశేఖర పడి(గర్భాలయపు గడప) వరకు తీసుకువెళ్ళి, స్వామివారికి హారతి ఇచ్చారు. ఆహా..అద్భుతమైన దర్శనం..! 
ప్రముఖ వాయులీన విద్వాంసురాలు కన్యాకుమారి గారు కూడా అనుకోకుండా ఆరోజు ఆలయం లో కలిశారు. వారితో పాటే మాకూ స్వామి దర్శనం జరిగింది. 
ఓం నమో వేంకటేశాయ .. !!
*******************

పూర్తిగా చదవండి...

Thursday, March 21, 2013

తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న 'నాదనీరాజనం' కార్యక్రమం లో నామ సంకీర్తనం


తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమం లో నా శ్రీమతి రుద్రావఝల కుసుమ కుమారి మరియు బృందం 'నామసంకీర్తన' గానం చేశారు. కార్యక్రమం ఈనెల 18వ తేదీన సాయంత్రం జరిగింది.  ఆరోజు శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో SVBC చానెల్ లో వీరి నామ సంకీర్తన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించలేదు. మరొక రోజు ప్రసారం అవుతుందట ...!
******************************************
Youtube link
 



పాల్గొన్న కళాకారులు:
శ్రీమతి రుద్రావఝల కుసుమకుమారి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల, కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, చి. కృష్ణప్రియ, చి. విష్ణుప్రియ, చి. శ్రుతి, చి. భవ్య, గాయత్రి, ప్రశాంతి, కామేశ్వరి, మనోహర్ 
వాద్య సహకారం: వయొలిన్: శ్రీ హెచ్.  రామ్ చరణ్, మృదంగం: జయదీప్, వేణువు: శ్రీ శైలపతి భరద్వాజ్
బృందం లోని కళాకారులంతా ప్రముఖ గాత్ర సంగీత విదుషీమణి శ్రీమతి మండ సుధారాణి గారి శిష్య ప్రశిష్యులే..!
 


కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, కుమారి కామేశ్వరి, శ్రీమతి కుసుమకుమారి, కుమారి గాయత్రి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల


చి. శ్రుతి, చి. కృష్ణప్రియ,  ప్రశాంతి
చి. విష్ణుప్రియ, మనోహర్, చి. భవ్య,
శ్రీయుతులు శైలపతి భరద్వాజ్, రామ్ చరణ్ 
శ్రీ జయదీప్ 
*****************************************
కార్యక్రమం తరువాత తి తి దేవస్థానం వారు కళాకారులందరికీ ప్రసాదాలు ఇచ్చి , శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. కులశేఖర పడి(గర్భాలయపు గడప) వరకు తీసుకువెళ్ళి, స్వామివారికి హారతి ఇచ్చారు. ఆహా..అద్భుతమైన దర్శనం..! 
ప్రముఖ వాయులీన విద్వాంసురాలు కన్యాకుమారి గారు కూడా అనుకోకుండా ఆరోజు ఆలయం లో కలిశారు. వారితో పాటే మాకూ స్వామి దర్శనం జరిగింది. 
ఓం నమో వేంకటేశాయ .. !!
*******************

పూర్తిగా చదవండి...

Wednesday, March 13, 2013

వంద వసంతాల శ్రీపాద పినాకపాణి

వంద వసంతాల శ్రీపాద పినాకపాణి
ీసు పి మీదూర్లో ఉండో గాలుగు రోజులుగేపు, టీవీ కి చూడేదు. ఇవాళళ్ళీ తిరుగప్రంలో శ్రీ శ్రీపాదినాకాణిగారికి అంత్యక్రియు జిగాయి చివి, విస్మానికి లోనయ్యాను. నిజానికి ఈ పోస్టు వ్రాద్దాముకున్ని శ్రీ పినాకపాణి గారి శతజయంతి సందర్భంగా..! మొదుపెట్టాను కాని వివిారాలల్ల ూర్తి చెయ్యేకోయాను. అదే పస్టుని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ూర్తి చెయ్యవలసి రావడం దురదృష్టకరం. 
 




పద్మభూషణ్ మెడల్ 
కర్ణాటక సంగీత లోకంతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ సుపరిచితులైన పద్మభూషణ్, సంగీత కళానిధి బిరుదాంకితులు డా. శ్రీపాద పినాకపాణి గారు నేడు తమ నూరవ పుట్టిన రోజును స్వస్థలమైన కర్నూలు లో జరుపుకుంటున్నారు. వృత్తిరీత్యా వారు మంచి హస్తవాసి గలిగిన వైద్యులుగా పేరు తెచ్చుకున్నా సంగీత లోకానికి చేసిన సేవ మరపురానిది. కర్ణాటక సంగీతం అంటే మద్రాసు, తంజావూరు లాంటి తమిళ నాడుకి చెందిన ప్రాంతాల వారు మాత్రమే పాడగలరు, వారు పాడినదే వినగలం అనుకొనే రోజుల్లో మన తెలుగువాడైన పినాకపాణి గారి కచ్చేరీలంటే తమిళశ్రోతలు చెవికోసుకొనేవారంటే వారి గాత్ర మాధుర్యం, విద్వత్తు ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు.
వారి శిష్యులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి లో పేరెన్నిక గన్న వోలేటి వేంకటేశ్వర్లు, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన సత్యనారాయణ మొదలైనవారు. ఇంకా శ్రీమతి సరస్వతీ విద్యార్ధి, వారి కుమార్తె కుమారి లహరి, మల్లాది సోదరుల పేరుతో ప్రసిద్ది చెందిన శ్రీ   శ్రీరామ్ ప్రసాద్ , శ్రీ రవికుమార్ గార్ల వంటి ఎందరో శిష్య ప్రశిష్యులను తయారు చేసి కర్నాటక సంగీతాన్ని మరిన్ని తరాలు ముందుకు తీసుకుపోయే రాచ బాటలు వేసారు శ్రీ పినాక పాణి గారు. 
1993-94లో అనుకుంటా.. (నేను సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టి రెండేళ్ళు మాత్రమే అయిఉంటుంది) నేదునూరి కృష్ణమూర్తి గారి పరిచయ భాగ్యం కలిగింది. వారు వ్రాసిన 'అన్నమయ్య పదసౌరభం' పుస్తకానికి ముఖచిత్రం వెయ్యమని అడిగారు. మల్లాది సోదరులతో  పరిచయం కలిగింది కూడా శ్రీ నేదునూరి గారి ఇంటివద్దే. అప్పుడే శ్రీపాద పినాకపాణి గారి పుస్తకం 'మనోధర్మ సంగీతం' గురించి వినడం. ఆయన గురించి, ఆ పుస్తకాన్ని గురించీ చెబుతూ మల్లాది శ్రీరాంప్రసాద్ గారు నాకు దాని వ్రాతప్రతి కాపీని నాదగ్గర ఉంచుకోమని ఇచ్చారు. ముత్యాల్లాంటి పినాక పాణి గారి దస్తూరితో ఉన్న ఆ వ్రాత ప్రతి నా వద్ద ఇంకా భద్రంగా వుంది. తరువాత ఆపుస్తకం తితిదేవస్థానం వారు ముద్రించాక తిరుపతిలో కొనుక్కున్నాను. అలాగే పాణి గారు వ్రాసిన 'నా సంగీత యాత్ర' సంగీత ప్రపంచం లో వారి అనుభవ సారాన్ని క్రోడీకరించి,  వర్ధిష్ణు కళాకారులకి స్స్ఫూర్తిదాయకం గా ఉండే ఎన్నో సంగతులని స్పృశించారు. 

తితిదేవస్థానం వారిచే నాలుగు భాగాలుగా ముద్రించబడిన 'సంగీత సౌరభం' సంగీత లోకానికే  మకుటాయమానం.
వారి శతజయంత్యుత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం, వారి శిష్య ప్రశిష్యులు, మరియు రాష్ట్ర ప్రభుత్వం చేతులమీదుగా వైభవంగా జరిగింది. ఆ రోజు వారి స్వగృహం లో జరిగిన అభినందన మరియు సన్మాన కార్యక్రమ విశేషాలు  ఈ లింక్ నొక్కి చూడండి. 
శ్రీపాద వారివే ఇంకొన్ని ఫోటోలు:



వివిధ పత్రికలలో శ్రీ పినాకి గారి ంతి సందర్భంగా వచ్చిన వ్యాసాలు ఒక్క చోటే మనందరికోసం: 

గాంధర్వ వేదామృతవాణి.. పినాకపాణి -కొమాండూరి శేషాద్రి (ఆంద్ర భూమి)
 
స్వరరాగ ఝురికి వందేళ్లు (సాక్షి)

ఈ శతాబ్దపు సంగీత కళానిధి - డాక్టర్ శ్రీపాద పినాకపాణి -- ఈరంకి వెంకట కామేశ్వర్

కినిగే లో శ్రీపాద వారి పుస్తకాలు

The Masterpiece Collection - Live Concert - Dr Sripada Pinakapani (వారు పాడిన కీర్తనల ఆడియో లింక్)


అదందర్ంగా దూరర్న్ సప్తిరి వారు పినాకాణి గారితో నిర్వించిన ఇంటర్వ్య ప్రారం చారు.  (చాలా పాతి అనుకుంటా.. ! కీసం ఇరై ఏళ్ల క్రితంది. దానిలో వారి దినర్యొత్తం చూపిస్తూ, ిష్యులో వారి పాలు, డక్టు గి ప్రాక్టీసు, వ్యాయామొదైని చూపించారు. 

శ్రీపాద వారి గురించి శ్రీ సాయి బ్రహ్మానందం గొర్తి గారఈమాటెబ్ పత్రికవ్రాసిన వ్యాసం  మంచి లింక్ అందించిన 'అజ్ఞాత' కు ధన్యవాదాలు 



ఆంధ్రదేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులు డా. శ్రీపాద పినాకపాణి గారి కుటుంబానికీ, వారి శిష్య ప్రశిష్యులకూ , అశేషమైన వారి అభిమానులకూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 
పూర్తిగా చదవండి...

Sunday, March 10, 2013

శ్రీరంగం గోపాలరత్నం గారు మరియు బృందం ఆలపించిన ॥ దారిద్ర్య దహన శివస్తోత్రం ॥

బ్లాగు మిత్రులందరికీ మహాశివరాత్రి పర్వ దిన శుభాకాంక్షలు.  
 


ఈ సందర్భంగా చాలాసంవత్సరాల క్రితం రేడియో లో భక్తిరంజని కార్యక్రమంలో 
శ్రీరంగం గోపాలరత్నం గారు మరియు బృందం ఆలపించిన 
॥ దారిద్ర్య దహన శివస్తోత్రం ॥ వినండి :
దారిద్ర్య దహన శివస్తోత్రం ॥
విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||1||
గౌరీ ప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||2||

భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవ సాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణ నామ సునృత్యకాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||3||

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మనికుండల మండితాయ
మంజీరపాద యుగళాయ జటాధరాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||4||

పంచాననాయ ఫణి రాజ విభూషణాయ,
హేమాంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపహాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||5||

భాను ప్రియాయ భవ సాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్రత్రయాయ శుభ లక్షణ లక్షితాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||6||

రామ ప్రియాయ రఘునాధ వర ప్రదాయ
నామ ప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||7||

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ  ||8||
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ॥ 9॥

॥ ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ ॥

  


దీనితో పాటు నాకు చాలా ఇష్టమైన ఇంకొక శివ స్తోత్రం డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు గానం చేసిన శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం . దీని ఆడియో ఫైల్ నాదగ్గర ఉండేది కానీ సమయానికి కనిపించలేదు . మిత్రులెవరి వద్దనైనా ఉంటే  షేర్ చెయ్యగలరు .
*************************************
శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం 
గానం: శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ  శుద్ధాయ దిగంబరాయ తస్మై  “న” కారయ  నమఃశివాయ   1

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర  ప్రమధనాధ మహేశ్వరాయ
మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై “మ ” కారయ నమఃశివాయ  2

శివాయ గౌరీ వదనారవిoద సూర్యాయ దాక్షాద్వర నాశకాయ
శ్రీ నీలకంటాయ వృషద్వజాయ తస్మై  “శి”కారయ  నమఃశివాయ  3

వశిష్ట కుంభోద్భవగౌతమాది మునీంద్ర  దేవార్చిత  శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై  “వ” కారయ  నమఃశివాయ  4

యక్షస్వరూపాయ జటాధరాయ పినాక  హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై  “య” కారయ  నమఃశివాయ 5

పంచాక్షర  మిదం పుణ్యం యః  పఠేత్ శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి   శివేన  సహమోదతే ||
*************************************


సాంబసదాశివ  సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివా ..!!
*************************************

పైన కనిపిస్తున్న రెండు బొమ్మలూ సుమారు 12 ఏళ్ళ  క్రితం నేను వేసినవే.. !
శివ గంగా సంగీత పరిషద్, హైదరాబాద్ వారికి వేసిన బొమ్మ.. మొదటిది చిత్తు..రెండోది ఫెయిర్ చేసినది.
శ్రీ  నేదునూరి కృష్ణ మూర్తి గారు అడిగి వేయించుకున్నారు.
*************************************
విజయనగరం లో వెలసిన శ్రీ పశుపతినాధేశ్వర స్వామి ఆలయ విశేషాలని గురించి ఇదివరకు నా బ్లాగులో వ్రాసిన 
శ్రీ పశుపతినాధేశ్వర దర్శనం 
చదవడానికి పై లింక్ మీద నొక్కండి  
 


 
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)